టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు వల్ల తాను 100 కోట్లు నష్టపోయానని దగ్గుబాటి వారి అబ్బాయి రానా అంటున్నాడు. ఈమధ్య మీడియాతో మాట్లాడుతూ రానా ఈ ఆశక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. 2005 లో కోలీవుడ్ హీరో సూర్యా మురుగుదాస్ దర్శకత్వంలో నటించిన ‘గజిని’ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చిన వెంటనే రానా ఈ సినిమాను తమిళంలో చూసి ఈ సినిమా ఇంకా తెలుగులోకి డబ్ కాకముందే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామని నిశ్చయించుకుని రానా మహేష్ ను కలిసి తెలుగులో తీయబోతున్న ఈ సినిమా రీమేక్ లో హీరోగా నటించమని అడిగాడట.  అయితే అటువంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులు చూడరని అందువల్ల ఆ సినిమాను రీమేక్ చేయడం అటు మహేష్ కాని, రానాకు మంచిది కాదని సలహా ఇచ్చాడట మహేష్. అయితే మహేష్ చెప్పిన సమాధానం రుచించక పట్టువదలని విక్రమార్కుడిలా ‘గజిని’ సినిమాను ఏదోవిధంగా తెలుగులో రీమేక్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో రానా తన బాబాయి వెంకటేష్ దగ్గర ఈ సినిమా ప్రస్తావన తీసుకు వచ్చి ఈ సినిమాను వెంకటేష్ హీర్గా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ తీస్తే బాగుంటుందని సూచించాడట.  అయితే వెంకీ కూడ సూర్య చేసిన పాత్రకు తాను నప్పనని చెప్పడంతో రానా చేసిది లేక ‘గజిని’ సినిమాను తెలుగులో రీమేక్ చేయలేక పోయాడట. ఆ తరువాత ఈ సినిమా తెలుగులో డబ్ చేయబడి ఘన విజయం సాధించడమే కాకుండా ఆ తరువాత అమీర్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ చేయబడి కోట్ల వర్షం కురిపించు కున్న సంగతి తెలిసిందే . దీనితో ఇప్పటికీ రానా మహేష్ కనిపించినప్పుడు ప్రతీసారీ నీ వల్లనే 100 కోట్లు పోగొట్టుకున్నాను అంటూ సటైర్లు వేస్తాదట ఈ లీడర్ 

మరింత సమాచారం తెలుసుకోండి: