టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ మూవీలు తీసిన డైరెక్టర్ వీరు పోట్ల. బిందాస్, రగడ, దూసుకెళ్తా వంటి మూవీలతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ట్రేడ్ మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా వీరుపోట్లకి ఓ మల్టీస్టారర్ మూవీ ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తుంది. అయితే చాలా మంది వీరుపోట్లకి అంత సీన్ లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందకంటే వీరు పోట్ల సక్సెస్ ఫుల్ మూవీలని ఇచ్చినప్పటికీ, ఆ క్రెడిట్ వీరుపోట్ల‌కి క్రెడిట్ ద‌క్క‌లేదు. అంతే కాకుండా తన పేరు సైతం అంతగా పబ్లిసిటీ కాలేదు. తన మూవీలు తాను చేసుకుంటూ కామ్ అండ్ గోయింగ్ పద్దతితో హంగామా లేకుండా మూవీని తెరకెక్కించడం వీరుపోట్ల స్టైల్. తను గతంలో తీసిన ‘దూసుకెళ్తా’ కూడా ఓ నార్మల్ సినిమానే. దాంతో వీరు పోట్ల‌కి అవ‌కాశాలిచ్చే నిర్మాత‌లు క‌రువ‌య్యారు. ఇదిలా ఉంటే ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా వీరు పోట్ల చేతికి చిక్కింద‌న్న టాక్ వినిపిస్తోంది. త‌మిళ చిత్రం జిల్లాని తెలుగులో రీమేక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో వెంక‌టేష్‌, ర‌వితేజ క‌థానాయకులుగా న‌టిస్తార‌న్న టాక్. ఈ మల్టీస్టారర్ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వహించేందుకు వీరూపోట్ల‌కి అవకాశం వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్ద‌రు హీరోల్ని డీల్ చేసే సామ‌ర్థ్యం వీరుకి ఉందా? లేదా? అనే అనుమానం ఇక్కడ వ్య‌క్త‌మ‌వుతోంది. ప్రస్తుతం వీరుపోట్లకి పెద్దగా మూవీలు లేకపోవడంతో కొందరు తనకి ఈ ఆఫర్ వెళ్ళటంపై అంతగా ఆసక్తి చూపటం లేదు. వీరు పోట్ల కంటే మరో డైరెక్టర్ కి అవకాన్ని ఇస్తే మంచిదన్నట్టుగా చిత్ర యూనిట్ కి సూచిస్తున్నారు. మొత్తానికి ఒకవేళ ఈ మల్టీస్టారర్ ఆఫర్ వీరుపోట్లకి వెళ్ళిందంటే తనకు ఇది మంచి అవకాశం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: