పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోపాల గోపాల. గోపాల గోపాల మూవీలో మరొకొత్త స్టారింగ్ జతకానుంది. ఇప్పటి వరకూ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు 70 శాతం పూరైంది. కొన్ని కీలక సీన్స్, అలాగే ప్యాచ్ వర్క్ తప్పితే మిగతా షూటింగ్ దాదాపు పూరైనట్టేనని చిత్ర యూనిట్ వద్ద నుండి అందిన సమాచారం ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ గోపాల గోపాల మూవీలో మోడరన్ శ్రీకృష్ణుడుగా నటిస్తున్నాడు. ఈ మూవీలో దేవుడిపై కేసు వేసే ఒక నాస్తికుడి పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ ‘ఓ మై గాడ్’లో కీలకమైన స్వామిజీ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తి నటించారు. తెలుగు రిమేక్ లోనూ ఈ పాత్రకి మిథున్ చక్రవర్తినే తీసుకోవాలని చూస్తున్నారు. అందుకు మిథున్ చక్రవర్తి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. తాజాగా మిథున్ చక్రవర్తి తన డేట్స్ సర్దుబాటు కావడం లేదంటూ చెప్పడంతో ఈ పాత్రకి తెలుగులో మరో యాక్టర్ ని చూశారు. ఇప్పుడు మిథున్ చక్రవర్తి ప్లేస్ లో సాయి కుమార్ నటిస్తున్నారని తాజా సమాచారం. చిత్ర యూనిట్ నుండి త్వరలోనే దీనికి సంబంధించిన అఫిషియల్ న్యూస్ బయటకు రానుంది. ప్రస్తుతం గోపాల గోపాల మూవీ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. డి. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: