బాలీవుడ్ బాద్షా షారుఖ్, సల్మాన్ పంధానే ఎంచుకున్నడా? అనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంతో బాలీవుడ్ లో దక్షిణాది చిత్రాలు వరస విజయాలు సాధిస్తున్న నేపధ్యంలో షారూఖ్ ఖాన్ కూడ ఇదే మార్గాన్ని అనుసరించ బోతున్నాడు. బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ ఎంపరర్ గా మార్చిన ‘అత్తారింటికి దారేది’ ని బాలీవుడ్ బాధ్షా రీమేక్ చేస్తాడని విపరీతంగా వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఈ సినిమాను నిర్మించిన బివి ఎస్ ఎన్ ప్రసాద్ సహా నిర్మాతగా షారూఖ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తాడని టాక్. అదేవిధంగా తెలుగు వెర్షన్ కు దర్శకత్యం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సల్మాన్ ను గౌతమ్ నందాగా చూపెట్ట బోతున్నాడని మీడియా వార్తలు రాస్తోంది.  చెన్నై ‘ఎక్సప్రెస్’ చిత్రం విజయవంతం అయిన దగ్గరనుండి షారూఖ్ దృష్టి దక్షిణాది సినిమాల పై పడింది అని అంటారు. ఈ వార్తలే నిజం అయితే త్రివిక్రమ్ ఖ్యాతి బాలీవుడ్ ను కుడా షేక్ చేస్తుంది అని అనుకోవాలి. ప్రస్తుతం త్రివిక్రమ్, బన్నీల సినిమా ఇక ఉండకపోవచ్చు అని గాసిప్స్ వస్తున్న నేపధ్యంలో త్రివిక్రమ్ కు ఈ అనుకోని ఛాన్స్ దొరికేతే అది ఆయనకు జాక్ పాట్ అనే అనుకోవాలి.  ఏమైనా ‘అత్తారిల్లు’ గాలి షారుఖ్ కు కుడా తాకింది అనుకోవాలి. పంచ్  డైలాగులకు చిరునామాగా ఉండే త్రివిక్రమ్ బాలీవుడ్  సినిమా కల్చర్ ను కుడా ఎంతవరకు మార్చగలడు అనేది ప్రశ్న. 

మరింత సమాచారం తెలుసుకోండి: