ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రభస. సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సమర్పణలో ఆయన తనయుడు గణేష్బాబు నిర్మిస్తున్నారు. సమంతా, ప్రణీత కథానాయికలు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకులముందుకురాబోతుంది.
ఆగస్టు 1న హైదరాబాద్లో ఆడియోను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి తమన్ చక్కటి సంగీతాన్నందించాడు. ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ చిత్రంలో వుంటాయి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్.కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.వెంకటరత్నం.
మరింత సమాచారం తెలుసుకోండి: