బాలీవుడ్ బాదుషా గా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను పెంచుకున్న షారుక్ ఖాన్ 300 కోట్ల రికార్డు పై కన్నేసి త్వరలో వస్తున్న ‘హ్యాపి న్యూయిర్’ సినిమా ట్రైలర్ గత గురువారం ఆగస్టు 14న విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షారుక్ అభిమానులు మూడు గెటప్ లలో కనిపించిన షారుక్ కొత్త సినిమా మూడు నిముషాల ట్రైలర్ ను తెగ ఎంజాయ్ చేసారు. అయితే మన తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారు మాత్రం షారుక్ కొత్త సినిమా ‘హ్యాపి న్యూయిర్’ ట్రైలర్ కంటే అదే రోజు బన్ని స్వాతంత్రదినోత్సవ సందర్భంగా విడుదల చేసిన ‘ఐ యామ్ దట్ ఛేoజ్’ షార్ట్ ఫిలింకు ఎక్కువ క్లిక్ లు ఇచ్చి చూడటం సంచలనంగా మారింది. తెలుగు వారిలో చాలామంది షారుక్ అభిమానులు ఉన్నా ఆ హీరో ట్రైలర్ విడుదలైన విషయమే పట్టించుకోకుండా అందరూ బన్నీ షార్ట్ ఫిలిం గురించి మాట్లాడుకోవడం బట్టి అల్లుఅర్జున్ ఏకంగా బాలీవుడ్ బాదుషా కే షాక్ ఇచ్చాడు అంటూ బన్నీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మెగా కుటుంబ నేపధ్యాన్ని కొనసాగిస్తూ చిరంజీవి పవన్ ల తరువాత సామాజిక విషయాల పై స్పందిస్తూ అల్లుఅర్జున్ చేసిన ప్రయోగానికి టాలీవుడ్ సెలెబ్రెటీల నుండి సామాన్యుల వరకు అందరూ ప్రసంసించడం బన్నీని జోష్ లో ముంచేస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: