తనకు నచ్చితే ఏదైనా చేసేస్తాను అని అంటోంది తెలుగుతెర జేజమ్మ అనుష్క. మూడు పదుల వయస్సు దాటి పోయినా ఇప్పటి వరకు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న అనుష్క హీరోలతో సమానంగా బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతోంది. ఇంటెక్స్ మొబైల్స్ కు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న అనుష్క నిన్న భాగ్యనగరంలోని తాజ్ కృష్ణలో ఈ కంపెనీ ‘ఆక్వా స్టైల్ ప్రోను’ ఆవిష్కరించి సందడి చేసింది. తన సినిమాల గురించి మాట్లాడను అని చెపుతూ తాను తన కెరియర్ లో ఒక ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ఇదే మొదటిసారి అని చెపుతోంది.  తాను ఒక ప్రోడక్ట్ ను ప్రమోట్ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని చెపుతోంది ఈ ‘బాహుబలి’ రాజకుమారి. ప్రతివారు తన వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తాను భావిస్తానని అందువల్ల తనకు అన్ని విధాల ఒక ప్రోడక్ట్ నచ్చితేనే దానిని ప్రమోట్ చేస్తానని చెపుతోంది ఈ యోగ బ్యూటీ. అభిమానుల ఆదరణ తోనే తాను టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నాను అని చెపుతున్న అనుష్క అభిప్రాయంలోని గొప్ప వ్యక్తిత్వం పై క్లారిటీ ఇస్తే ఆమెను అభిమానించే చాలామంది ఆమెను ఈ విషయంలో కూడ అనుసరించే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: