ఈమధ్య కాలంలో దర్శకులు తాము తీస్తున్న భారీ సినిమాల పబ్లిసిటీ వేడుకలలో పాల్గొంటూ ఏడవడం ఫ్యాషన్ గా మారి పోయింది. ‘రభస’ ఆడియో వేడుకలో అందరూ చూస్తుండగానే జూనియర్ ను పొగుడ్తూ ఆ సినిమా దర్శకుడు చిన్న పిల్లాడులా ఏడ్చాడు. ఈ విషయంలో తాను కూడ ఏమి తక్కువ కాదు అంటూ ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ఈమధ్య ‘గోవిందుడు అందరి వాడెలే’ సినిమా టీజర్ ఫంక్షన్ లో తన కంటి నిండా నీరు పెట్టుకుని మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు. తన పేరు చెపితే నిర్మాతలు పారిపోతున్న ప్రస్తుత రోజులలో పిలిచి తన కొడుకును తన చేతిలో పెట్టిన చిరంజీవి ఔదార్యం గురించి ఆకాశానికి ఎత్తేస్తూ ఇమోషన్ లో తన కంట నీరు పెట్టుకున్నాడు. అయితే ఈ సంఘటన వెనుక ఒక పెద్ద వ్యవహారమే నడిచింది అని టాక్.  చిరంజీవి తన 150వ సినిమా దర్శకుల లిస్టు లో లేటెస్ట్ గా కృష్ణ వంశీని కూడా చేర్చాడు అని టాక్. వినాయక్ వైపు చిరంజీవి మొగ్గు చూపుతున్నా పనిలో పనిగా కృష్ణవంశీ చెప్పిన కధ గురించి కూడ చిరంజీవి ఆలోచిస్తున్నాడని ఫిలిం నగర్ రూమర్. అయితే కృష్ణవంశీకి ఇచ్చే అవకాసం గోవిందుడు సినిమా విజయం పై ఆధార పడి ఉంటుంది అని అంటున్నారు. ఈ విషయాన్ని అన్యాపదేశంగా కృష్ణ వంశీకి అర్ధమయ్యే భాషలో చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు అని టాక్. ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే బంపర్ ఆఫర్ లా వచ్చిన ఈ అనుకోని అవకాశానికి తట్టుకోలేక కృష్ణవంశీ ‘గోవిందుడు’ విజయం పై చాల ఇమోషనల్ గా ఆలోచిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఒక పక్క వినాయక్ మరొక పక్క కృష్ణవంశీలతో మ్యూజికల్ చైర్ ఆడుతున్న చిరంజీవి తెలివితేటలు బాగానే ఉన్నా వినాయక్, కృష్ణవంశీలకు చాలా ఇమోషనల్ గా మారిపోతోంది అనే వార్తలు వినపడుతున్నాయి. చిరంజీవి తన 150వ సినిమా కధ విషయం పై ఇప్పటికీ క్లారిటీ రాలేక పోవడంతో ఈ మ్యూజికల్ చైర్ గేమ్ మరికొంత కాలం సాగుతుంది అని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: