పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేలో తన వివరాలు ఇచ్చేందుకు నిరాకరించాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇదే బాటను తెలుగు తెర రాములమ్మ విజయశాంతి కూడ అనుసరించింది అనే వార్తలు కూడ వినపడుతున్నాయి. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన ఎన్యుమరేటర్లకు తన వివరాలు తెలపడానికి పవన్ నిరాకరించాడు అని మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఎన్నికల తరువాత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్న పవన్ ఈ సమగ్ర కుటుంబ సర్వేను నిరాకరించడం ద్వారా మళ్ళీ పొలిటికల్ హాట్ న్యూస్ లలోకి రావడమే కాకుండా అనేక ఊహగానలకు తెర తీస్తున్నాడు. మరి రాబోతున్న రోజులలో ఈ పరిణామాలు ఎటువంటి రాజకీయ ట్విస్ట్ లకు ఆస్కారం ఇస్తుందో అనే ఆ శక్తి అన్ని వర్గాలలోను నెలకొని ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: