ప్రస్తుతం బుల్లితెర హవా పెరిగి పోవడంతో టాప్ హీరోలు అంతా ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు తమ క్రేజ్ పడిపోకుండా బుల్లితెర పై ప్రసారం అవుతున్న షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర క్రేజ్ ను కూడ కోట్లుగా మార్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో కన్నడ హీరో టాలీవుడ్ ఈగ విలన్ సుదీప్ చేస్తున్న బుల్లితెర యాంకరింగ్ పై ప్రస్తుతం కన్నడ సినిమా రంగంలో పెద్ద దుమారం నడుస్తోంది. అన్ని భాషల హీరోలు, హీరోయిన్లు టీవీ షోలలో యాంకర్లుగా మారినట్లు సుదీప్ చేసిన ప్రయత్నం మొదట్లోనే వివాదాలకు కారణం అయింది. దీనికి కారణం శాండల్‌వుడ్ స్టార్‌లుగా వెలుగొందుతున్న వారు యాంకర్‌లుగా మారుతుండడంతో ఈ స్టార్ యాంకర్ల కార్యక్రమాలు వారాంతాల్లో ప్రసారం అవుతుండడంతో థియేటర్లకు రావాల్సిన ప్రేక్షకులు మరియు అభిమానులు టీవీ చూడ్డానికే పరిమితo అవుతూ ఉండటంతో కన్నడ సినిమాలకు వీకెండ్ కలెక్షన్స్ బాగా పడిపోతున్నాయట. దీనితో యాంకర్‌లుగా వ్యవహరిస్తున్న స్టార్ నటులను సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని నిర్మాతల సంఘం కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలికి ఫిర్యాదు చేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఇదే విధానాన్ని కోలీవుడ్ చిత్ర పరిశ్రమ కూడా త్వరలోనే అనుసరించాలని ఆలోచన చేస్తున్నట్లు టాక్. కోలీవుడ్ ను అన్ని విషయాలలోనూ అనుసరించే మన టాలీవుడ్ నిర్మాతలు కూడ ఇదే విధానాన్ని భవిష్యత్ లో అనుసరిస్తే బుల్లితెర పై మెరుస్తున్న టాప్ హీరోలకు కష్టమే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: