మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి ఏమి చేసినా అందులో హడావిడి చాల ఎక్కువగా ఉంటుంది. అందుకే మంచు లక్ష్మి చేసే పనులు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. ఈమధ్య మంచు లక్ష్మి హీరో సుమంత్ ఛార్మీలతో కలిసి సముద్రతీర నగరం విశాఖపట్నం వెళ్ళారు.  అక్కడ జరుగుతున్న కబాడీ లీగ్ మ్యాచ్ లలో పాల్గొంటున్న తెలుగు టైటాన్ టీమ్ ను ప్రోత్సహించడానికి ఈ ముగ్గురు సినిమా సెలెబ్రెటీలు వైజాగ్ లో హంగామా చేసారు. ఉత్సాహంతో చేసిన హంగామా పూర్తి అయిన తరువాత ఈ ముగ్గురికీ ఆకలి వేయడంతో ఆ పోటీలు జరుగుతున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న ‘రాజు గారి దాభా’ కు వెళ్లి వాళ్లకు నచ్చిన సీ ఫుడ్ ను తిని వారు అందించిన ఆతిధ్యానికి మురిసిపోయారు. రాజు గారి దాభా బ్యానర్ ముందు ఫోటో తీయించుకుని తన ఫేస్ బుక్ లో పెట్టడమే కాకుండా ఆ రాజుగారి వ్యాపారానికి ఫ్రీ పబ్లిసిటీగా మంచు వారి అమ్మాయి చేస్తున్న కృషికి ఆ రాజుగారికి బిజినెస్ ఇంకెంత పెరుగుతుందో చూడాలి. సామాజిక సేవ అంటే ఇష్టపడే మంచు లక్ష్మి చేస్తున్న మరో ఫ్రీ పబ్లిసిటీ సేవా కార్యక్రమం అని అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: