పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గోపాల గోపాల మూవీ షూటింగ్ లో నటిస్తున్నాడు. గోపాల గోపాల మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గోపాల గోపాల మూవీలో తన రోల్ కి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసుకున్నాడు. ఇంత కాలం మూవీ షూటింగ్ బిజిలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు. అందుకు ఎంచక్కా బెంగుళూరు వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు. కామన్ గా పవన్ కళ్యాణ్ ఏదైనా మూవీ షూటింగ్ అయిపోయిన వెంటనే ఫారిన్ కి వెళ్ళి కొంత కాలం అక్కడ విశ్రాంతి తీసుకొని వస్తాడు. ఆ విధంగానే ఇప్పుడు కూడ పవన్ కళ్యాణ్ గోపాల గోపాల మూవీ షూటింగ్ అనంతరం రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే తన రోటీన్ కి భిన్నంగా ఈసారి ఇండియాలోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమగ్ర సర్వేకు పవన్ కళ్యాణ్ సహకరించలేదు అంటూ మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదని పవన్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే మరో వైపు గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్స్ ని మొదలు పెట్టారు. ఈ మూవీకి కూడ పవన్ కళ్యాణ్ త్వరగా పూర్తి చేయి, తరువాత పూర్తి స్థాయిలో క్రియాశీల రాజకీయాలలో తర మార్క్ ని చూపించాలనుకుంటున్నట్టుగా సమాచారం. గబ్బర్ సింగ్ 2 కి నిర్మాతగా శరత్ మరార్ ఉంటున్నాడు. అలాగే దర్శకుడిగా సంపత్ నంది ఉంటున్నాడు. అక్టోబర్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎటువంటి కథలను వినడం లేదు. తన ముందు ఉన్న గోపాల గోపాల, గబ్బర్ సింగ్ 2 మూవీలు రిలీజ్ వరకూ కామ్ అండ్ గోయింగ్ పద్దతిలో ఉండాలనుకున్నట్టు టాలీవుడ్ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: