నయనతారతో బ్రేకప్ అయ్యాక కొంత గ్యాప్ తీసుకుని హన్సికా శిoబుల ప్రేమ వ్యవహారం కోలీవుడ్ ను షేక్ చేయడమే కాకుండా పెళ్ళి పీటల వరకు వెళ్ళింది. అయితే క్లైమేక్స్ దగ్గర బ్రేక్ పడి హన్సికా శిoబుల ప్రేమ వ్యవహారం ముగిసిపోయింది. అయితే ఈ షాక్ నుండి హన్సిక వెంటనే తేరుకుని తన సినిమాల వేగం పెంచడమే కాకుండా తన ఎక్స్ పోజింగ్ డోసేజ్ కూడ పెంచి కోలీవుడ్ లో తన టాప్ హీరోయిన్ స్థానాన్ని నిలుపుకుంటూ వస్తోంది.  అయితే ఏమైందో ఏమో తెలియదు కాని కోలీవుడ్ లోని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ పత్రికా ప్రతినిధి శిoబు వ్యవహారం పై ప్రశ్నించినప్పుడు ఘాటైన వ్యాఖ్యలు తన బ్రేకప్ వ్యవహారం పై చేసింది. తమ రిలేషన్ షిప్ గురించి చెప్పడానికి ఇప్పుడు తన దగ్గర ఏమి లేదని అంటూ ఇటువంటి వ్యవహారాలలో ఎవరో ఒకరు సైలెంట్ గా ఉంటే మంచిదని అంటూ గడిచి పోయిన గతం గురించి ఇప్పుడు వాస్తవాలు చెపితే శిoబు హర్ట్ అవుతాడనీ అందువల్ల తాను ఏమి చెప్పానని చెపుతూ ఒక ట్విస్ట్ ఇచ్చింది. తమ లవ్ బ్రేకప్ అయిపోయినా శిoబు జీవితం బాగుండాలని కోరుకుంటానని అంటూ తన వైపు ఎవరైనా ఒక వేలు చూపెడితే తాను మూడు వేళ్ళు చూపెడతానని ఈ విషయం శిoబుకు కూడ వర్తిస్తుంది అంటూ హన్సిక చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. బ్రేకప్ అయిపోయిన ప్రేమ వ్యవహారాన్ని తిరిగి వెలుగులోకి తీసుకు వస్తు హన్సిక శిoబును ఎందుకు టార్గెట్ చేస్తోంది అనే విషయం పై కోలీవుడ్ మీడియా రకరకాలుగా వ్యాఖ్యానిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: