యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ సమర్పణలో యువనిర్మాత బెల్లంకొండ గణేష్ బాబు శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం ‘రభస’. ఈ చిత్రం ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా బెల్లం కొండ సురేష్ మాట్లాడుతూ ఇటీవల విడుదలలైన చిత్రం ఆడియో చాలా పెద్ద హిట్ అయ్యిందని త్వరలోనే ఈ చిత్రం ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయబోతున్నామన్నారు. ఆది లాంటి బ్లాక్ బ్లస్టర్ తర్వాత శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బేనర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న ఈ చిత్రం అభిమానును, ప్రేక్షకులను ఎంతగానే ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టాలెంట్ డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ యూత్ ఫుల్, మాస్ , ఫ్యామిలీ ఎంట్రటైనర్ గా ఈ సినిమా రూపొందించామన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్లాస్, మాస్ హీరోగా ఎంతగానో అలరిస్తారని చెప్పారు. కాగా ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లు సమంత, ప్రణీత పోటా పోటీగా నటించారని తమ అందంతో ప్రతి ఒక్కరిని కిర్రెక్కిస్తారని చెప్పుకొచ్చారు. చిత్రంలో ముఖ్య తారాగణం బ్రహ్మానందం, ఆలి, నాజర్, జయసుధ,సీత, జయప్రకాష్ రెడ్డి, షాయాజి షిండే, అజయ్, నాగినీడు, తదితరులు నటించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. ఎస్.థమన్ సంగీతం అందించగా, ఫోటోగ్రఫి శ్యామ్ కే.నాయుడు,పాటలు: రామజోగ్యశాస్త్రీ,శ్రీమణి, డాన్స్: రాజుసుందరం,ప్రేమ్ రక్షిత్, శేఖర్,ఫైట్స్ : రామ్ లక్ష్మణ్,విజయ్ ఎంతో కష్టపడి చిత్రానికి ప్రాణం పోశారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: