సినిమా సంగీత కెరటంలా పరుగులు తీస్తున్న క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ పాడిన పాట మహేష్ నమ్రతల మధ్య ప్రేమ పుట్టించింది అనే ఆశక్తికర విషయాన్ని ఈ మధ్య మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవిశ్రీ లీక్ చేసాడు. ఇక వివరాలలోకి వెళితే మహేష్ నమ్రతలు నటించిన ‘వంశీ ‘ సినిమా నుండి వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆ తరువాత పెళ్ళిగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ నమ్రాతల మధ్య చిత్రీకరించిన ‘వెచ్చ వెచ్చగా ఉండే చిలిపి కౌగిలి అంబరానికి నేడే ప్రేమ జాబిల్లి’ పాటను దేవీశ్రీప్రసాద్ పాడిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటను ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన మణి శర్మ ఒక ప్రముఖ సినీగేయ రచయిత చేత రాయిద్దామని అనుకుంటే కుదరక పోవడంతో అప్పటికప్పుడు మణి శర్మ దేవీశ్రీప్రసాద్ చేత ఈపాట రాయించి అతడి చేతే పాడించి రికార్డు చేసాడట.  అయితే అనుకోకుండా ఈ పాట చిత్రీకరణ సమయం నుంచి మహేష్ నమ్రతల మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది అన్న సంగతి దేవిశ్రీకి మహేష్ ఒక సందర్భంలో చెప్పాడట. అంతేకాదు మొట్టమొదటసారి దేవిశ్రీని మహేష్ తన భార్య నమ్రతకు పరిచియం చేస్తూ మన ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించిన మొట్టమొదటి ప్రేమ గీతాన్ని రచించిన రచయిత ఇతడే అంటూ పరిచియం చేసి జోక్ చేసాడని దేవిశ్రీ అలనాటి విషయాలను గుర్తుకు తెచ్చుకున్నాడు.  ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసిన ‘మనసంతా మహేష్’ కార్యక్రమంలో దేవిశ్రీ ఈ విషయాలను షేర్ చేసుకుని ఆ శక్తిని కలిగించాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: