ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్ డైరెక్టర్ మణిరత్నం . మణిరత్నం మూవీలో ఆఫర్ రావాలన్నా, హీరో-హీరోయిన్ గా నటించాలన్నా చాలా అదృష్టం ఉండాలి. అయితే ఇది ఒకప్పడు అని ఫిల్మ్ ఇండస్ట్రీ అంటుంది. ఇప్పుడు మణిరత్నం ట్రెండ్ మారిపోయింది. బ్లాక్ బస్టర్ సక్సెస్ లు ఇచ్చిన మణిరత్నం, ఇప్పుడు అదే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఘోర డిజాస్టర్స్ ని పరిచయం చేస్తున్నాడు. దీంతో మణిరత్నం అంటే పేరుకి గౌరవం ఇస్తున్నారు తప్ప, తను తీసుకువస్తున్న కథలకి మాత్రం దర్శక నిర్మాతలు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. అంతే కాకుండా హీరోలు సైతం మణిరత్నం కథని హోల్డ్ లో పెట్టేసి మరీ ఇంటరాగేషన్ చేస్తున్నారు. దీంతో మణిరత్నం క్రెడిబిలిటి ప్రతి సంవత్సరం దెబ్బతింటూనే వస్తుంది. తాజాగా గత మూడు సంవత్సరాల నుండి చూసుకుంటే టాలీవుడ్ కి చెందిన్న చాలా మంది ప్రముఖ హీరోలు మణిరత్నం మూవీకి నో చెప్పినవారే ఉన్నారు. మొదట మణిరత్నంతో మూవీ ఉంటుంది అని గర్వంగా చెప్పుకున్న హీరోలు, తరువాత ఆ మూవీ లేదంటూ మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. తాజాగా మణిరత్నం, చిరంజీవి 150వ సినిమా కోసం మణిరత్నం కథ రెడీ చేశారని కొందరు, రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా రూపొందించడానికి సన్నహాలు చేస్తున్నారు అంటూ మరికొందరు వార్తలు ప్రసారం చేశారు. అయితే మెగా కాంపౌండ్ హీరోలకు మణిరత్నం కథ నచ్చలేదు. ఈ విషయాన్నీ స్వయంగా చిరంజీవి వెల్లడించారు. బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిరత్నం సినిమా వర్కౌట్ కాలేదని చెప్పారు. అంతే కాకుండా మహేష్ బాబు, నాగార్జున హీరోలుగా ఒక సినిమా తెరకెక్కించడానికి మణిరత్నం ప్రయత్నాలు సాగించారు. అవి కూడా ఓ కొలిక్కి రాలేదు. ఈ విధంగా తెలుగు హీరోలు అందరూ మణిరత్నం కథలని రిజెక్ట్ చేసి తనకి షాక్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: