‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో టాలీవుడ్ లో మళ్ళీ మల్టీ స్టారర్ యుగాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ అడ్డాల మాయలో మహేష్ ఎన్టీఆర్ లు పడబోతున్నారు అంటూ గాసిప్పుల హడావిడి ఫిలింనగర్ లో జోరుగా జరుగుతోంది. మారుతున్న పరిస్తుతులను దృష్టిలో పెట్టుకుని టాప్ హీరోలు అంతా మల్టీ స్టారర్ ల వైపు మొగ్గు చూపుతూ ఉండటంతో ఇప్పుడు అదే విషయాన్ని శ్రీకాంత్ అడ్డాల తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు అని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాతోబిజీగా ఉన్న శ్రీకాంత్ అడ్డాల ఈమధ్య ఒక కధను పట్టుకుని అటు జూనియర్ ఇటు మహేష్ ఇళ్ళ చుట్టూ తిరుగు తున్నాడని టాక్. కుటుంబ నేపధ్యంలో మాస్ మసాలాను కూడ జతచేసి ఒక మల్టీ స్టారర్ సినిమాకు సరిపడే విధంగా తయారు చేసిన ఈ కధలో మహేష్ జూనియర్లకు సరిపడే పాత్రలను శ్రీకాంత్ క్రియేట్ చేసాడు అని అంటున్నారు. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన ఈ కధను చాల ఆశక్తిగా అటు జూనియర్ ఇటు మహేష్ లు వినడంతో వీరిద్దరి కాంబినేషన్ ను కలిపిన దర్శకుడిగా శ్రీకాంత్ మారబోతున్నాడు అంటూ అప్పుడే వార్తల హల్ చల్ మొదలైంది.  అయితే ప్రస్తుతం టాప్ హీరోల రేసులో పరుగులు తీస్తున్న మహేష్ జూనియర్లు ఇటువంటి సాహసం చేస్తారా అన్నదే ప్రశ్న. ఈ వార్తలే నిజం అయితే అది టాలీవుడ్ కు నిజమైన షాకింగ్ న్యూస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: