ఈ వారంలో విడుదల కాబోతున్న ‘రభస’ సినిమా పబ్లిసిటీ ఇంకా మొదలు కాకపోవడం పై టెన్షన్ పడుతున్న ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్ తన ఫేస్ బుక్ ద్వారా ఇచ్చిన తెలివైన సమాధానికి జూనియర్ కూడ ఆశ్చర్య పోయాడు అనే వార్తలు వస్తున్నాయి. తన కుమారుడు బెల్లంకొండ కొండ శీను కొత్త హీరో కాబట్టి కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది, జనాలకు జూనియర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాలా ? అని బెల్లంకొండ చేసిన కామెంట్లు జూనియర్ అభిమానులకు టెన్షన్ పెడుతూ ఉంటే ఎన్టీఆర్ కు రిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని ఫిలింనగర్ టాక్. అల్లుడు శీను సినిమా కోసం ఏడుకోట్లకు పైగా ఖర్చు పెట్టి హడావిడి చేసిన బెల్లంకొండ తన సొంత సినిమా ‘రభస’ పై ఇలా మాట్లాడటం ప్రస్తుతం టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. ఈ వార్తలు ఇలా ఉండగా పబ్లిసిటీతో సంబంధం లేకుండా ‘రభస’ విడుదల కాకుండానే హిందీ డబ్బింగ్ రేట్స్ తో కలిపి 56 కోట్లు బిజినెస్ చేయడం ఎన్టీఆర్ స్టామినాకు దర్పణంగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమాలో వచ్చే 7 యాక్షన్ సీన్స్ యంగ్ టైగర్ లోని రియల్ టైగర్ ను వెండి తెర పై చూపించి అభిమానులకు ‘రభస’ చేస్తుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. జూనియర్ కోరుకుంటున్న మెగా హిట్ ఈవారం వినాయకుడు జూనియర్ కు ఇవ్వాలని అభిమానుల కోరిక.  

మరింత సమాచారం తెలుసుకోండి: