భారతదేశ సినిమా ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ టాప్ హీరో సినిమా విడుదలకాని పంధాలో శంకర్ దర్శకత్వం వహిస్తూ విక్రమ్ హీరోగా విడుదలకు రెడీ అవుతున్న ‘ఐ’ దీపావళి రోజున విడుదల అవుతుంది అని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. టాలీవుడ్‌లో ‘మనోహరుడు’ పేరుతో డబ్ కానున్న ఈ సినిమా ద్వారా భారీ రికార్డుల పై విక్రమ్ దర్శకుడు శంకర్ లు కన్నేశారు అని వార్తలు రాస్తోంది.  ప్రస్తుతం ఈసినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపు పూర్తికావడంతో దీపావళి అక్టోబర్ 22న ఈ సినిమా విడుదల కావడానికి లైన్ క్లియర్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. 180 కోట్ల భారీ బడ్జెట్టుతో తీసిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 15వేల థియేటర్లలో విడుదల చేసేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ టాక్. టాప్ బాలీవుడ్‌ హీరోల సినిమాలు కూడా ఇప్పటివరకు మూడు వేల నుంచి ఐదువేల థియేటర్ల లోపే విడుదలైన సందర్భంలో ఈ సినిమా ఒకేసారి 15వేల థియేటర్ల రిలీజ్ కావడం ఒకవిధంగా సెన్సేషనేనని ఇండస్ర్టీలో చర్చించుకుంటున్నారు. హై టెక్నిక‌ల్ విలువలతో నిర్మింప బడ్డ ఈ సినిమా ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ఆదివారం చెన్నైలో మీడియా కోసం ప్రదర్శించారు.  తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి భారతీయ భాషలతో పాటు చైనా, తైవాన్‌ తదితర 25 పైచిలుకు విదేశీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలలో విక్రమ్ భయంకరమైన మృగరూపంలో కనిపించేందుకు 130 కిలోలకు బరువు పెరగడం ఈ సినిమాలోని ఒక ప్రత్యేకత. దక్షిణాది సినిమారంగ రికార్డులను ఈ సినిమా తిరగ రాస్తుందని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: