మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోవిందుడు అందరివాడేలే. ఈ మూవీలో రామ్ చరణ్ హీరోగా ఉంటే కృష్ణవంశీ డైరెక్టర్ గా ఉంటున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కెర్లు కొడుతుంది. గతంలో ఓ బడ్జెట్ తో ఫిక్స్ అయిన గోవిందుడు అందరివాడేలే మూవీ, ఇప్పుడు ఆ బడ్జెట్ రూపు రేఖలు మారిపోయాయి. ఈ మూవీకి నిర్మాతగా ఉంటున్న బండ్లగణేష్ పై అదనపు భారం పడుతుంది. నిర్మాతకి దాదాపు అనుకున్న బడ్జెట్ కంటే మరో మూడు కోట్ల రూపాయలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' దసరాకి విడుదల కావాల్సి ఉండగా, ఇపుడు అది మిస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో కృష్ణవంశీ కొన్ని మార్పులు చేశారట. ఇప్పటికే ప్రకాష్‌రాజ్, జయసుధ పార్ట్ రీషూట్ వల్ల సినిమా చిత్రీకరణ లేట్ అయింది. అలాగే ప్రొడక్షన్ కి సంబంధిన పలు మార్పులు చేర్పులు ఉండటంతో, అలాగే డైరెక్టర్ కృష్ణవంశీ ఎడిటింగ్ ఉంటేనే ఫస్ట కాఫీ బయటకు రావడం సాధ్యపడదు. ఇది సాధ్యపడకపోవడంతో అనుకోని కారణాలు వల్ల రామ్ చరణ్ నటిస్తున్న మూవీ బడ్జెట్ మరో 3 కోట్ల రూపాయలు అదనంగా పెరిగి, నిర్మాతకి భారం కానుందని టాలీవుడ్ అంటుంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గాచేస్తుంది. కాజల్ సైతం ఈ మూవీపై భారీగానే అవకాశాలు పెట్టుకుంది. ఎందుకంటే గోవిందుడు అందరివాడేలే మూవీ సక్సెస్ పైనే కాజల్ తరువాత అవకాశాలు ఆధారపడి ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: