సెల్ ఫోన్స్ ఇంటర్నెట్ సంస్కృతికి అలవాటు పడిపోవడంతో ప్రస్తుత యువతరానికి జనరల్ నాలెడ్జి బాగ తగ్గి పోతోంది అని విమర్శలు వినిపిస్తున్న నేపధ్యం తెలిసిందే. ఇక మన సెలెబ్రెటీలయితే ఈ జనరల్ నాలెడ్జి విషయంలో సామాన్యులకన్నా మరీ ఘోరంగా ఉంటున్నారు అన్న మాటలు తరుచూ వింటూనే ఉన్నాం.  కానీ నేటి యూత్ ను షేక్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఒక టివి ఛానల్ కు లైవ్ షోలో ఇచ్చిన సమాధానాలు విన్నవారికి ఇటువంటి ఘోరమైన సమాధానాలు ఇచ్చే సెలెబ్రెటీలు కూడ ఉంటారా? అని ఎవరికైనా సందేహం వస్తుంది. ప్రముఖ బుల్లితెర యాంకర్ కరణ్ జోహార్ తన లైవ్ షో ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన అలియాభట్ ను మన భారతదేశానికి రాష్ట్రపతి ఎవరు ? అని అడిగిన ప్రశ్నకు ఆమె తడుము కోకుండా భారత రాష్ట్రపతి పేరు పృద్వీ రాజ్ చవాన్ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పి కరణ్ జోహార్ మైండ్ బ్లాంక్ చేసింది. అంతేకాదు మరొక అడుగు ముందుకు వేసి కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ భారతదేశాన్ని నిజంగా ఒక మహిళా ప్రధానమంత్రి పరిపాలించిందా? అని కరణ్ జోహార్ కు ఎదురు ప్రశ్న వేయడంతో ఈ బుల్లితెర యాంకర్ కాఫీ బదులు మంచినీళ్ళు తాగ వలసి వచ్చింది. దేశనాయకులే కాదు చాలామంది సినిమా సెలెబ్రెటీల పేర్లు కూడ ఈ అమ్మడికి తెలియవు. అందుకే ఆ మధ్య అఖిల్ ఎవరూ అంటూ మీడియాకు ఎదురు ప్రశ్న వేసింది అలియా. అయితే తన జనరల్ నాలెడ్జి పై జనం సెటైర్లు వేస్తున్న విషయం తెలుసుకున్న అలియా తన బ్యూటీతో పాటు తన తెలివితేటలను పెంచుకోవడానికి బ్రెయిన్ జిమ్ముల చుట్టూ ఈ బ్యూటీ ప్రధక్షణాలు చేస్తోందని బాలీవుడ్ మీడియా సెటైర్లు వేస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: