రేపు విదుద అవుతున్న రభస కు మరో ఊహిoచని ప్రమాదం పొంచి ఉందని ఫిలిం నగర్ లో వార్తల హడావిడి విపరీతంగా జరుగుతోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అభిమానుల మధ్య విడుదల కాని ‘రభస’ పై నెగిటివ్ సమాచార మౌఖిక పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది అంటూ విపరీతమైన వార్తల హడావిడి జరుగుతోంది. అంతేకాదు ‘రభస’ విడుదల అయ్యే ధియేటర్లకు దూరంగా ఉండమని కూడ ఈ నెగిటివ్ ప్రచారం ఉద్దేశ్యం అని అంటున్నారు. అయితే ఈ ఓరల్ టాక్ ను ఎవరు ఇలా పనికట్టుకుని ప్రచారం చేస్తున్నారో అన్న విషయం పై క్లారిటీ లేదు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం నిరంతరం అభిమానిస్తూ శ్రమించే ఒక ప్రముఖ సామాజిక వర్గానికి జూనియర్ పై వచ్చిన కోపంతో ఇటువంటి ఓరల్ రూమర్లు హడావిడి చేస్తున్నాయని కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఈ వార్తలతో సంబంధం లేకుండా ఇరు రాష్ట్రాలలోను ‘రభస’ విడుదల అయ్యే ధియేటర్ల దగ్గర ఎడ్వాన్స్ బుకింగ్ హడావిడి జోరుగా జరుగుతోంది అనే వార్తలు వస్తున్నాయి. కొందరు విశ్లేషకులు మాత్రం ‘రభస’ విడుదలకు ముందే జూనియర్ తన పంతం వీడి నందమూరి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా బాలకృష్ణతో ఎదోఒక విధమైన సయోధ్య చేసుకుని ఉంటే ఈ సమస్యలు వచ్చి ఉండేవి కావు అని అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా అసలు విషయం రేపు తేలిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: