సంగీత కెరటం దేవీశ్రీప్రసాద్ రేపు ప్రపంచ వ్యాప్తంగా మైకేల్ జాక్సన్ అభిమానులు జరుపుకొ బోతున్న మైకేల్ పుట్టినరోజు సందర్భంగా ఆ టాప్ సేలిబ్రెటీకి నివాళిగా ‘జల్సా యమ్‌జే’ అనే పాటను ఈరోజు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేయనున్నాడు రేపు మైకేల్ జాక్సన్ పుట్టినరోజు కావడంతో ఆయన పై తనకున్న గౌరవాన్ని చాటుకునే విధంగా ఈ పాటను తాను ట్యూన్ చేసి స్వయంగా పాడి యూట్యూబ్ లో విడుదల చేస్తున్నాను అంటూ ప్రకటించాడు దేవిశ్రీ. ఇటీవల యూఎస్‌లోని పలు నగరాల్లో ఏడు రోజులపాటు మ్యూజికల్ షోస్ ను నిర్వహించి అక్కడి తెలుగు వారిని అదరగొట్టాడు దేవీశ్రీప్రసాద్. అక్కడి తెలుగు ప్రజలు తనకు ఇచ్చిన ప్రోత్సాహంతో తన ఉత్సాహం మరింత రెట్టింపు అయింది అని అంటున్నాడు దేవిశ్రీ.  ఈమధ్య మీడియాతో మాట్లాడుతూ దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన కామెంట్ సంచలనంగా మారింది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి పాటలు స్వరపరుస్తున్నారు కదా అంటూ ప్రశ్నించిన మీడియా ప్రతినిధి ‘లెజెండ్’ విజయోత్సవంలో బోయపాటి గురించి ఘాటుగా స్పందించారు కదా? అన్న మీడియా ప్రశ్నకు ‘‘బోయపాటిగారు మంచి వ్యక్తి. ఆయనతో కలిసి మూడు హిట్ సినిమాలు చేశాను. మా మధ్య మంచి అనుబంధం ఉంది. సినిమా అన్నాక ఏదో మాటా మాటా వస్తుంది. అంతమాత్రాన అనుబంధాలు చెడిపోవు’’ అంటూ ట్విస్ట్ ఇచ్చిన దేవిశ్రీ తన పాటల ట్యూనింగ్ లోనే కాదు తన మాటల్లోనూ వెరైటీ ఉంటుందని రుచి చూపించాడు దేవిశ్రీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: