లెజెండ్ మూవీ దర్శకుడు బోయపాటి శ్రీను, అలాగే ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ల మధ్య విభేదాలు ఎక్కువుగా ఉన్నాయని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన న్యూస్ పై దేవిశ్రీ ప్రసాద్ అఫిషియల్ గా కామెంట్ చేశాడు. దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఎటువంటి విబేధాలు లేవు, తనతో కలసి పనిచేయడం చాలా హ్యాపీ . మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. ‘లెజెండ్’ సక్సెస్ మీట్లో జరిగిన సంఘటన చాలా చిన్నది. మా కాంబినేషన్లో మంచి హిట్స్ ఉన్నాయి. అంటూ దేవిశ్రీ ప్రసాద్ బోయపాటి శ్రీను గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడాడు. అంతే కాకుండా త్వరలోనే వీరిద్దరూ కలిసి మరలా జోడి కట్టబోతున్నారు. ‘అల్లుడు శీను’ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు సంగీతం అందించడం చాలా ఆనందంగా ఉంది అంటూ దేవిశ్రీ, బోయపాటి గురించి మాట్లాడాడు. లెజెండ్ మూవీ ఆడియో ఫంక్షన్ లో దేవిశ్రీ ప్రసాద్, బోయపాటి మధ్య జరిగిన మాటల యుద్దం నిజంగానే వీరిద్దరి మధ్య పెద్ద గొడవకు తెరలేచినట్టుగా అనిపించింది. ఆ సక్సెస్ మీట్ ఫంక్షన్ తరువాత మీడియా, అలాగే పలువురిలోనూ దీనికి సంబంధించిన టాక్స్ ఎక్కువుగా వినిపించాయి. ఇప్పటి వరకూ బోయపాటి దర్శకత్వం వహించిన 5 సినిమాలలో 3 సినిమాలకు దేవి సంగీతం అందించారు. అవి ఘన విజయం సాదించాయి. ఇప్పడు రాబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ లోనూ, బోయపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ దేవిశ్రీతో వచ్చే నెలలో ప్రారంభం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: