ఒకనాటి తెలుగుతెర విలన్ చరణ్ రాజ్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుడి గుడిలో తుపాకీతో హల్ చల్ చేయడం మీడియాకు సంచలన వార్తగా మారింది. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకుడ్ని ప్రముఖ నటుడు చరణ్ రాజ్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా దర్శించుకున్నాడు.  అయితే ఈరోజు అందరు గణపతి దగ్గరకు పువ్వులు, పండ్లతో వస్తుంటే చరణ్ రాజ్ డిఫరెంట్ గా వినాయకుడుని దర్శించుకున్నాడు. చరణ్ రాజ్ ఆలయ ప్రాంగణoలోకి చేరుకోగానే ఆయన వద్ద తుపాకీ ఉన్నట్లు ఆలయ సిబ్బంది తనిఖీలలో భాగంగా గుర్తించారు అనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. ఆ తుపాకీని ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే ఆలయంలోకి తుపాకీతో వెళ్లకూడదన్న విషయం తనకు తెలియదని చరణ్ రాజు ఆలయ అధికారులకు తెలిపాడట. అంతేకాదు ఈ విషయంలో తనను భక్తులు, ఆలయ అధికారులు క్షమించాలని చరణ్ రాజు కోరారు అని తెలుస్తోంది.  చిన్న హడావిడి తరువాత ఆలయ అధికారులు చరణ్ రాజ్ కు తుపాకీ ఇచ్చేశారట. గణనాధుడు చరణ్ రాజ్ ను క్షమించాడనే అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: