ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ త్వరలోనే ఓ నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడు. ప్రస్తుతం వినాయక్ చిరంజీవి 150వ సినిమా కోసం చూస్తున్నట్టుగా టాలీవుడ్ నుండి కథనాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వినాయక్ ఓ వైపు దర్శకత్వ బాధ్యతలు చేపడుతూనే, మరోవైపు తన బిజినెస్ కి చెందిన పనుల్లో బిజిగా ఉన్నాడు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందిన సమాచారం ప్రకారం, వినాయక్ త్వరలోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఓ సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతున్నాడు. అదేమిటంటే ఇప్పటి వరకూ దర్శకుడిగా ఉన్న వినాయక్ త్వరలోనే నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు. ఇప్పటికే వినాయక్ కొన్ని కథలను వినడం జరుగిందని టాలీవుడ్ లో కథనాలు తెలుస్తున్నాయి. వినాయక్ తెరకెక్కించిన సినిమాలు ఇప్పటి వరకూ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధించాయి. అలాగే తను నిర్మాతగా మారి, కథా బలం ఉన్న చిన్న మూవీలను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడట. దాంతో త్వరలోనే దీనికి సంబంధించిన నిర్ణయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నాడు. ఇప్పటికే దర్శకుడిగా ఉన్న సుకుమార్, ఓ మూవీకి నిర్మాతగా మారాడు. ప్రస్తుతం పెద్ద పెద్ద దర్శకులు అందరూ ఇలా నిర్మాతల అవతారం ఎత్తడంతో, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త నిర్మాతలు పరిచయం అవ్వబోతున్నారన్నమాట. వినాయక్ నిర్మాతగా రాబోతున్న కొత్త మూవీలో హీరో, హీరోయిన్స్ కొత్తవాళ్ళు ఉంటారా? పాత వాళ్ళు ఉంటారా? అనేది తెలియాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సిందే మరి. ఇదిలా ఉంటే వినాయక్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ ఫిల్మ్ అల్లుడు శీను, బాక్సాపీస వద్ద సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా, డెబ్యూ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి పేరుని కూడ తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: