టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు సినిమా చూడడానికి టికెట్లు దొరకలేదు అంటే ఎవరూ నమ్మరు. కాని మహేష్ ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. నిన్న రాత్రి జరిగిన ‘ఆగడు’ ఆడియో వేడుకలో అతిధిగా పాల్గొన్న దర్శకుడు శంకర్ గొప్పతనం గురించి మాట్లాడుతూ తాను చెన్నైలో ఉండే ఆ రోజులలో శంకర్ సినిమాల పట్ల ఉండే విపరీతమైన మోజుతో తాను కూడ సామాన్య ప్రేక్షుడిలా శంకర్ సినిమాలను మొదటి రోజు మొదటి ఆట చూడడానికి బ్లాక్ లో టికెట్లు కొనుక్కుని చూసేవాడినని చెపుతూ శంకర్ ను ఆకాశానికి ఎత్తేశాడు మహేష్. ఇదే సందర్భంలో తన ‘ఆగడు’ డైరెక్టర్ శ్రీనువైట్ల గురించి మాట్లాడుతూ మహేష్ ‘దూకుడు’ విడుదలైన వెంటనే ‘ఆగడు’ టైటిల్ గురించి తనకు శ్రీనువైట్ల తనకు చెప్పాడని అంటూ ‘ఆగడు’ తన కెరియర్ కు మరో టర్నింగ్ పోయింట్ ఇచ్చే సినిమాగా చరిత్ర సృష్టిస్తుందని అభిప్రాయ పడ్డాడు మహేష్. ఇంత వరకు బాగానే ఉంది కాని అసలు ట్విస్ట్ ఏమిటంటే ‘ఆగడు’ ఆడియోకి అతిధిగా వచ్చిన శంకర్ మాత్రం మహేష్ అభిమానులు ఆశించిన స్థాయిలో ప్రిన్స్ ను పొగడకుండా సంగీత దర్శకుడు తమన్ గురించి మాట్లాడటం కొందరికి ఆశ్చర్యంగా అనిపించింది. బహుశా గతంలో మహేష్ శంకర్ తెలుగులో తీయాలనుకున్న ‘త్రీ ఈడియట్స్’ స్నేహితుడు సినిమాలో నటించక పోవడం ఒక కారణమై ఉండాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: