నిన్న సాయంత్రం జరిగిన ‘ఆగడు’ ఆడియో వేడుకకు మహేష్ తో కలిసి వచ్చిన నమ్రత కుడిచేతి మీద మీడియా కన్ను పడింది. ఆమె కుడిచేతి పై ఉన్న టాటూని ఫోటోలు తీయడానికి మీడియా కెమెరాలు తెగ ఉత్సాహం చూపించాయి. సామాన్యంగా క్రేజీ హీరోయిన్స్ తాము ఎవరితోనైనా పీకలలోతులో ప్రేమలో కూరుకు పోయినప్పుడు ఆ ప్రియుడి పేరును తమ వంటి పై టాటూగా వేయించు కుంటూ ఉంటారు. అయితే ఒకనాటి మిస్ ఇండియా నమ్రత తాను మహేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక పూర్తిగా గృహిణిగా మారిపోయింది. అయినా ఒకప్పటి హీరోయిన్ కాబట్టి ఈమె కూడ ఆ టాటూల క్రేజ్ నుండి తప్పించుకోలేక అనుకోవాలి తన కుడి చేతి పై మహేష్, గౌతమ్ సితార పేర్లను టాటూగ వేసుకుని తనకు తన కుటుంబం అంటే ఎంత ఇష్టమో తెలిసేటట్లుగా ప్రవర్తించింది. మహేష్ సినిమా కెరియర్ ఎలా ఉన్నా ప్రిన్స్ చాల ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా అవకాశాలు పొందడం వెనుక ముంబాయ్ లోని ప్రముఖ యాడ్ కంపెనీల అధినేతలతో నమ్రతకు ఉన్న పరిచయాలే అని అంటారు. నిన్నటి ఆడియో వేడుకలో తమన్నా రాకపోయినా నమ్రత టాటూలు మాత్రం అందర్నీ ఆకర్షించాయి.    

మరింత సమాచారం తెలుసుకోండి: