ఒకొక్కసారి సినిమాల ఎంపికలో హీరో, హీరోయిన్స్ తీసుకునే నిర్ణయాలు మరొకరికి అదృష్టంగా మారతాయి. గతంలో రవితేజ వదులుకున్న పూరి ‘పోకిరి’ సినిమా మహేష్ ఇంట వాలి ప్రిన్స్ ను సూపర్ స్టార్ ను చేసింది. ఇప్పుడు తెలుగు తెర సీతమ్మ అంజలి విషయంలో కూడ అటువంటి అదృష్టమే వరించింది. ఈమధ్య విడుదలై హిట్ టాక్ ను తెచ్చుకున్న ‘గీతాంజలి’ సినిమాకు మొదట్లో ఈ సినిమా దర్శక నిర్మాతలు హీరోయిన్ గా కలర్స్ స్వాతిని సంప్రదించారట. అయితే స్వాతి ఈ సినిమా విషయం పై ఎటూ తేల్చక పోవడంతో హీరోయిన్ పాత్రలో అంజలి వచ్చి చేరి పోయిందట. కేవలం 4 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ సినిమా ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాలలోను13 కోట్లు వసూలు చేసిందని ఈ సినిమా దర్శకుడు రాజ్‌కిరణ్ చేపుతున్నాడని టాక్. వైవిధ్యంగా తీస్తే చిన్న సినిమాలను హారర్ కామెడీలను ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పడానికి నిదర్శనం ‘గీతాంజలి’ అని అంటున్నాడు దర్శకుడు రాజ్ కిరణ్. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్ తీస్తానని రాజ్ కిరణ్ అంటున్నాడు. మరొక ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమా కధను శ్మశానంలో కూర్చుని రాజ్ కిరణ్ తాయారు చేసాడట. ఏది ఏమైనా శ్మశానం రాజ్ కిరణ్ కు అదృష్టాన్ని ఇచ్చింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: