తెలుగు సినిమా దిగ్గజ దర్శకుడు బాపు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాపు ఆదివారం చెన్నైలోని మల్లార్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. మూడేళ్ల కిందట తన ప్రాణస్నేహితుడు రమణ లోకాన్ని వదిలి వెళ్లాక మానసికంగా బాపు ఒంటరివాడయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా శ్రీరామరాజ్యం. బాపు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: