టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కమర్షిల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. పూరీ జగన్నాధ్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస మూవీలు చేస్తు మూవీలకు లాభాలను తీసుకువస్తున్నాడు. తన మూవీ బాక్సాపీస్ వద్ద హిట్టా? పట్టా? అనే విషయం పక్కన పెడితే, నిర్మాతకు మాత్రం నష్టాలు రాకుండా చూడాలన్నదే పూరీ జగన్నాధ్ ఫార్ములా. అందుకే పూరీ జగన్నాధ్, తన మూవీలను కమర్షియల్ గా హిట్ చేసుకుంటాడు. ఇదిలా ఉంటే తాజాగా పూరీ జగన్నాధ్ ముందుస్తు బెయిల్ తెచ్చుకొని టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. పూరీ జగన్నాధ్ నాంపల్లి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కి నమోదు చేసి సంపాదిచుకున్నాడు. ఒక స్థలానికి సంబందించిన గొడవకి కారణంగా ఈ బెయిల్ కి నమోదు చేసినట్లు సమాచారం. బ్యాంక్ జప్తులో వున్న ఒక భూమితో పూరి లావాదేవిలు జరిపినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిననత వరకూ ఎటువంటి ఇబ్బందులలో పడకూడదు అని పూరి ఈ విధంగా ప్రయత్నం జరిపినట్టు సమాచారం. బ్యాంకు జప్తులో ఉన్న భూమికి సంబంధించిన వ్యవహారం అతి కొద్ది రోజుల్లోనే ఓ కొలిక్కి రానుంది. అందకే పూరీజగన్నాద్ తన వంతు ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాధ్, జూనియర్ ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: