బాలకృష్ణతో సుమారు ఆరు సినిమాలలో హీరోయిన్ గా నటించిన రోజా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చాల క్రియాశీలకంగా వ్యవహరించి ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుని ప్రస్తుతం ఎమ్ఎల్ఎ గా కొనసాగుతున్నారు. అయితే ఇంత హఠాత్తుగా ఆమెకు ఏమైందో తెలియదు నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో రోజా బాలయ్యను టార్గెట్ చేస్తూ వేసిన సెటైర్లను ఒక ఒక ప్రముఖ ఛానల్ యధాతధంగా ప్రసారం చేయడంతో ఈ వార్త సంచలనంగా మారడమే కాకుండా బాలకృష్ణ అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి.  ఆ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రోజా బాలకృష్ణ మాట తీరును అనుకరిస్తూ ‘‘ఆరోజుల్లో నాన్నగారు’’ అంటూ మొదలుపెట్టిన రోజా.. ఫక్కున నవ్వేసింది. అయితే అక్కడున్న మీడియా ప్రతినిధి తన మాటలను పూర్తి చేయాల్సిందిగా కోరితే.. "ఆ రోజుల్లో నాన్నగారు భైరవద్వీపం సినిమాకు డైరక్షన్ చేస్తే... అందులో నేను, రోజా నటించాం" అంటూ చేతులు తిప్పుతూ బాలయ్యలా హావభావాలు ప్రదర్శించింది. దీనితో అక్కడున్న వారంతా ఆమె బాలకృష్ణ పై చేసిన అనుకరణను చూసి నవ్వేశారు. అయితే బాలయ్యను అనుకరిస్తూ రోజా ఈవిధంగా కామెంట్లు ఎందుకు చేసిందో అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన నందమూరి అభిమానులు మాత్రం రోజా తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బాలయ్యకు రోజా బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో అసెంబ్లీ సమావేశాలలో చలరేగిపోతు ఉపన్యాసాలు ఇస్తున్న రోజా సరదాకు ఇలా చేసిందా? లేదంటే ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో బాలయ్యను టార్గెట్ చేసిందా? అనే విషయం రానున్న రోజులలో తెలిసే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: