మహాబలేశ్వర్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత యూనిట్ కు లాంగ్ లీవ్ ప్రకటించిన ‘బాహుబలి’ క్రియేటర్ రాజమౌళి ఈ సినిమా ప్రచారానికి సంబంధించి మరొక కొత్త ఎత్తుగడ వేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి ‘బాహుబలి’ ప్రచారం కోసం ప్రబాస్, రానాల మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ ని నిర్వహిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్లు టాక్.  ప్రస్తుతం యూత్ లో ఉన్న క్రికెట్ ఫీవర్ ను ఆసరాగా తీసుకుని టాలీవుడ్ లోని యువ నటీనటులతో రెండు టీమ్స్ ను తయారుచేసి ఒక టీమ్ ను ప్రభాస్ టీమ్ గా మరో టీమ్ ను రానా టీమ్ గా మార్చి ఒక లిమిటెడ్ ఓవర్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ద్వారా ‘బాహుబలి’ కి మరింత క్రేజ్ తీసుకు వచ్చే ఆలోచన రాజమౌళి చేస్తున్నాడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రికెట్ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒక మంచి పనికి ఉపయోగించే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. గతంలో రాజమౌళి నిర్మించిన ‘ఛత్రపతి’ విడుదలకు ముందు కూడ రాజమౌళి ఇటువంటి ప్రయోగమే చేసి సక్సస్ సాధించాడు. అదే పద్ధతిని కొనసాగిస్తూ రాజమౌళి ‘బాహుబలి’ క్రేజ్ అటు ప్రేక్షకులలోనూ ఇటు బయ్యర్లలోను మరింత పెరగడం కోసం తెలుగు సినిమా జక్కన్న ఈ ఎత్తుగడ వేస్తున్నాడు అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: