దర్శకత్వం వహించినవి పట్టుమని ఆరు సినిమాలే కాని తన 7వ సినిమాకే 16 కోట్ల ఆదాయంపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కన్నేశాడు అనే వార్తలు సంచలనంగా మారాయి. అప్పటి వరకు భారీభారీ డైలాగ్స్ తో నడిచే తెలుగు సినిమా స్థితిని తన తూటాల లాంటి తక్కువ మాటలను పంచ్ లుగా మార్చి త్రివిక్రమ్ చేసిన ప్రయోగం సక్సస్ కావడంతో తెలుగు తెరకు మాటల మాంత్రికుడిగా మారిపోయాడు.  2002లో తరుణ్ ‘నువ్వే నువ్వే’ తో మొదలు పెట్టి నిన్నటి ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేసిన ‘అత్తారింటికి దారేది’ వరకూ దాదాపు 11 ఏళ్లలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించింది ఆరు సినిమాలే అయినా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో నేడు రాజమౌళి తరువాత స్థానంలో త్రివిక్రమ్ ఉండటంలో ఆయన సమర్ధతతో పాటు ఆయన అదృష్టం కూడ కలిసి వచ్చింది. త్రివిక్రమ్ హీరోల లిస్టులో కేవలం పవన్, మహేష్, బన్నీలు మాత్రమే ఉన్నా టాలీవుడ్ హీరోలంతా త్రివిక్రమ్ సినిమాలలో నటించాలని కోరుకోవడం ఆయన క్రేజ్ ను తెలుపుతోంది. ఆఖరుకు నాగార్జున కూడ అఖిల్‌ను త్రివిక్రమ్‌తోనే హీరోగా పరిచయం చేయాలని భావించినట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తనకు సూపర్ హిట్ ఇచ్చిన ‘అత్తారిల్లు’ సినిమా తరువాత ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లుఅర్జున్ తో చేస్తున్న లేటెస్ట్ మూవీకి పారితోషికంగా 12 కోట్లు, ప్రాఫిట్స్‌లో షేరింగ్ రూపంలో ఒక ఏరియా రైట్స్ కలిపి దాదాపు 16 కోట్లు త్రివిక్రమ్ కు ముడుతోందని ఫిలింనగర్ లో గాసిప్ ల హడావిడి జరుగుతోంది. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా వస్తున్న వార్తలు మటుకు త్రివిక్రమ్ స్టామినాను చాటుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: