ప్రిన్స్ మహేష్ బాబు నటించిన అప్ కమింగ్ మూవీ ఆగడు. ఆగడు మూవీకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారనుంది. మహేష్ బాబు నటించిన ఆగడు మూవీ ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మొదటిసారిగా మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగించుకోబోతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ లోకి కార్పోరేట్ సంస్థ వచ్చింది. దీంతో ఆగడు మూవీకి సంబంధించిన థియోటర్స్ లిస్ట్ ఆమాంతంగా పెరిగింది. అంతే కాకుండా ఆగడు మూవీ బాక్సాపీస్ సైతం మొదటి వారంలోనే దాదాపు 70 కోట్ల రూపాయలను చేరుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్ వారు ప్రకటించిన తాజా ప్రకటనలో ‘ ఆగడు ప్రొడక్షన్ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థ యైన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా ద్వారా ఆగడు ని రిలీజ్ చేయనున్నాం. సౌత్ ఇండియాలోని నాలుగు భాషల్లో కలిపి 2000 థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నాం. ఇకపై ఎరోస్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ పై పోకస్ పెట్టనుందని, అందులో భాగంగా ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ ‘కత్తి’ ఆడియో రైట్స్ తీసుకున్నామని’ ప్రకటించింది. ఇప్పటి వరకూ సౌత్ ఇండియాలోనే 2000 థియేటర్స్ లో రిలీజ్ అయితే, ఈ సంస్థ మరోసారి రీ-షెడ్యూల్ చేసి మరో 400 వందల థియోటర్స్ ని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇంత భారీ మొత్తం థియోటర్స్ లో రిలీజ్ అవుతున్న మూవీకి మొదటి రోజు కలెక్షన్స్, రికార్డ్ ఓపెనింగ్స్ ని కలిగి ఉంటాయని బాక్సాపీస్ లెక్కలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: