రానా త్రిషల పై రూమర్స్ రావడం సర్వ సాధారణమైన విషయంగా మారి పోయింది. ఆ మధ్య రాఘవేంద్రరావు తనయుడు వివాహానికి కొత్త జంటలా అ పెళ్ళి రిసెప్షన్ కు వెళ్ళి అందరి దృష్టిని ఆకర్షించారు. మీడియా కెమెరాలు అందంగా ఉన్న వీరిద్దరి జంటను ఫోటోలుగా తీసి పత్రికలలో ప్రచురిస్తే మా మధ్య ఎటువంటి ప్రేమ వ్యవహారం లేదు అనుకోకుండా ఆరోజు పెళ్ళి వేడుకలో అలా కలిసాం అంటూ మాటలతో సరిపెట్టేసారు రానా త్రిషలు. ఇది జరిగి కొద్ది రోజులు కూడ కాకుండానే వీరిద్దరూ జంటగా మలేషియాలో జరుగుతున్న ‘సీమా’ అవార్డు ఫంక్షన్ కు జంటగా వెళ్ళడమే కాకుండా వారిద్దరూ ఒకే విమానంలో పక్కపక్కన సీట్లలో కూర్చుని ప్రయాణిస్తున్న ఫోటోను ‘మేమిద్దరం విమానంలో’ అంటూ రానా ఆ ఫోటోను తన సోషల్ మీడియా సైట్లో పోస్ట్ చేసి వారిద్దరి మధ్యా వస్తున్న వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాడు రానా. ఇప్పటి దాకా మీడియా కెమెరాలు వీరిద్దరిని వెంటాడుతూ రహస్యంగా ఫోటోలు తీస్తే ఈ సారి ఏకంగా రానా తనకు తానే త్రిషతో విహారయాత్రకు వెళుతున్న ఫోటోను పోస్టు చేయడం సంచలనమైoది. జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఈ ప్రేమ జంట నిజమైన జంటగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: