జూనియర్ కెరియర్ కు షాక్ లపై షాక్ లు తగులుతున్నాయి. జూనియర్, నాగార్జునతో కలిసి నటిస్తాడు అని అనుకున్న ఒక మల్టీ స్టారర్ కధ విషయంలో ఆ దర్శకుడు వంశీ పైడి పల్లితో బేధాభిప్రాయాలు రావడంతో ఆ సినిమా నుండి జూనియర్ తప్పుకున్న విషయానికి సంబంధించి ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనితో ఆ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఇక లేదు అని అనుకున్నారు అంతా. అయితే 'యుగానికొక్కడు', 'ఆవారా' వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌ని ఆకట్టుకున్న హీరో కార్తి ఇప్పుడు జూనియర్ చేస్తాడు అని అనుకున్న ఆ మల్టీస్టారర్ మూవీలో యంగ్ టైగర్ స్థానాన్ని కార్తి కబ్జా చేసి నాగార్జునతో కలిసి నటించడానికి దర్శకుడు వంశీ పైడి పల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి. ఎప్పటి నుంచో టాలీవుడ్ లో ఒక డైరెక్ట్ సినిమాను చేయాలి అని చాల వ్యూహాత్మకంగా ఎదురుచూస్తున్న కార్తి అనుకోకుండా తన వద్దకు వచ్చిన ఈ అవకాశాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒప్పుకుని జూనియర్ కు అనుకోని షాక్ ఇచ్చాడని సమాచారం. తను చెప్పిన విధంగా కధలో మార్పులు చేసి వంశీ పైడి పల్లి తిరిగి తన వద్దకు కొంత గ్యాప్ తో వస్తాడు అని ఆనుకున్న జూనియర్ ఎత్తుగడకు వంశీ పైడి పల్లి తాను తయారు చేసిన అదే కధకు కోలీవుడ్ హీరో కార్తి రూపంలో సమాధానం ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో సంచలన వార్తగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: