మరో వారం రోజుల లోపే ‘ఆగడు’ ను రిలీజ్ కు సిద్ధం చేస్తూ బిజీగా ఉన్న శ్రీనువైట్ల ఇంత బిజీలో కూడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసినట్లుగా వస్తున్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. టాలీవుడ్ సినిమా రంగాన్ని విశాఖపట్నంలో అభివృద్ధి చేయడానికి సంకల్పిస్తున్న చంద్రబాబును అభినందించడానికి శ్రీనువైట్ల చంద్రబాబును కలిసినట్లుగా వార్తలు వస్తున్నా ఈ భేటీకి ఎదో ఒక ప్రాముఖ్యత ఉంది అంటూ ఫిలింనగర్ గుసగుసలు వినపడుతున్నాయి. అరకులోయ, శ్రీకాకుళం ప్రాంతాలలోని ప్రకృతి రమణీయ ప్రాంతాలను సినిమా షూటింగ్ లకు బాగా వినియోగించుకుంటే టాలీవుడ్ పరిశ్రమ అతిత్వరగా కోస్తా ప్రాంతంలో కూడ అభివృద్ధి చెందుతుంది అని శ్రీనువైట్ల చంద్రబాబు వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో శ్రీనువైట్లకు తారస పడ్డ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ అన్నీ కుదిరితే చంద్రబాబు జీవితం పై ఒక సినిమాను తీయాలని తనకు కోరిక ఉంది అనే విషయాన్ని వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాల దర్శకుడిగా పేరుగాంచిన శ్రీనువైట్ల ఒక రాజకీయ సినిమాను తీస్తూ మరో కొత్త ప్రయోగానికి తెర తీస్తాడు అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: