ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అప్ కమింగ్ ఫిల్మ్ ఐ కి సంబంధించిన కొన్ని విషయాలు అందర్ని ఆశ్ఛర్యపరుస్తున్నాయి. దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఐ మూవీకి ఏ విధంగా బిజినెస్ చేయాలనేది నిర్మాతలకు, దర్శకుడికి పెద్ద సవాల్ గా మారింది. దీంతో ఐ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ని దర్శకుడు శంకర్ రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్ ని చూసిన వెంటనే, సినీ ప్రేక్షకులు ఐ మూవీపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈ మూవీపై బిజినెస్ కూడ శరవేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఐ మూవీ ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరుపటానికి ప్లానింగ్స్ జరుగుతున్నాయి. సంచలన దర్శకుడు శంకర్ తాజా చిత్రం 'ఐ' ఆడియో పంక్షన్ కు హాలీవుడ్ యాక్షన్ స్టార్ ఆర్నాల్డ్ ష్క్వార్జ్ నెగ్గర్ వస్తున్నారు. చెన్నైలో ఈ నెల 15న జరిగే ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ష్క్వార్జ్ నెగ్గర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 32 సెకెన్ల నిడివిగల యూ టూబ్ వీడియోలో తన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. 'అద్భుతమైన చిత్రాన్ని తీసిన గొప్ప దర్శకుడు శంకర్ కు నా అభినందనలు. 'ఐ' ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంటున్నాను. సినిమా తప్పకుండా విజయవంతమవుతుంది ' అని ష్క్వార్జ్ నెగ్గర్ అన్నారు. విక్రమ్ హీరోగా నటించిన 'ఐ' చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ స్వరాలందించారు. ఆర్నాల్డ్ ష్క్వార్జ్ ఈ ఐ మూవీ ఆడియో ఫంక్షన్ కి వస్తున్నాడటంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఐ మూవీ వైపు చూస్తుంది. అంతే కాకుండా ఐ మూవీ ఇండియన్ బాక్సాపీస్ ని షేక్ చేయటమే కాకుండా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టామినాను సైతం పెంచేస్తుందని అంటున్నారు. మొత్తానికి శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మూవీ కోసం యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, సినీ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: