టాలీవుడ్ టాప్ యంగ్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో పోటీగా రాబోతున్న ‘కరెంటు తీగ’ గోవిందుడు ఆడియో ఫంక్షన్ విషయంలో కూడ పోటీ పడబోతోంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు మనోజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా మంచు విష్ణు నిర్మించిన ‘కరెంట్ తీగ’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ రేపు జరగబోతున్న ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో రిలీజ్ కు ఒక్కరోజు ముందు నేడు జరుగుతూ ఉండటంతో నిజంగానే ‘గోవిందుడు’ కు షాక్ ఇవ్వడానికి మంచు ఫ్యామిలీ డిసైడ్ అయిందా అని అనిపించేడట్లుగా వార్తలు ఉన్నాయి. ఈ ఆడియో వేడుకకు ప్రత్యేకంగా సన్నీలియోన్ రావడం హాట్ టాపిక్ గా మారడమే కాకుండా టాలీవుడ్ పరిశ్రమలోకి వచ్చి ఈ సంవత్సరంతో పదేళ్లు పూర్తి చేసుకున్న మంచు మనోజ్ ను సన్నీ లియోన్ ఈ సినిమా ద్వారా ప్రయోట్ చేస్తోంది అనే సెటైర్లు కూడ వినపడుతున్నాయి.  జి నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న 'కరెంట్ తీగ' లో యూత్ ను ఆకర్షిస్తూ ఎక్కువ కరెంటు ఉండటానికి ఈ సినిమాలో సన్నీ లియోన్, శిల్పి శర్మలతో వేర్వేరుగా రెండు ఐటమ్ సాంగ్స్ ఉండటం సంచలనంగా మారింది. ఎలా చూసినా నేటి 'కరెంట్ తీగ' ఆడియో ఫంక్షన్‌లో సన్నీ ఒక స్పెషల్ ఎట్రాక్షన్.  రేపు సెన్సార్ కు వెళ్ళబోతున్న ఈ సినిమా విషయంలో రెచ్చిపోయి చేసిన సన్నీ ఐటమ్ సాంగ్ కు సెన్సార్ ఎలా ప్రతిస్పందిస్తుంది అన్న ఆలోచన అందరిలోనూ ఉంది. ఏది ఏమైనా చెరణ్ ను మనోజ్ ఒక ఐటమ్ గర్ల్ సహాయంతో గట్టి పోటీకి దిగడం ఆశక్తి దాయకంగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: