మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆగడు’ సెన్సార్ టాక్ ఆ శక్తికరంగా మారింది. కొన్ని చిన్నచిన్న కట్స్ తో ‘ఆగడు’ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు యు/ఎ సర్టిఫికేట్ ఇవ్వడంతో ‘ఆగడు’ పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మారిపోయింది. ఈ సినిమాలో మహేష్ బాబు పేల్చిన పంచ్ డైలాగ్స్ ను సెన్సార్ సభ్యులు కూడ బాగా ఎంజాయ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పంచ్ డైలాగ్స్ ను పలకడంలో మహేష్ ప్రదర్శించిన యాస ఈ సినిమాకు హైలెట్ గా మారుతుందని సెన్సార్ సభ్యులు శ్రీనువైట్ల దగ్గర అభిప్రాయ పడిపోతున్నట్లు టాక్. శ్రీనువైట్ల కామెడి ట్రాక్ ఈ సినిమాకు ఒక ఎసట్ గా మారుతుందని సెన్సార్ బోర్డ్ ప్రశంసించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక శ్రుతిహాసన్ స్పెషల్ సాంగ్ ఈ సినిమాలో చక్కగా కుదరడమే కాకుండా శ్రుతి మహేష్ ల మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ అదిరిపోయిందని వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ‘ఆగడు’ రికార్డుల క్రియేట్ చేయడం ఖాయం అని వార్తలు వస్తున్నా, ఫిలింనగర్ లో వినిపిస్తున్న మరొక వర్గం వార్తల ప్రకారం ‘ఆగడు’ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మరోసారి చిన్నచిన్న మార్పులతో ‘గబ్బర్ సింగ్’ ను చుసిన ఫీలింగ్ కలుగుతుందనే వార్తల జోరు కూడ వినిపిస్తోంది.  మహేష్ కు ఒక సూపర్ హిట్ ఇచ్చిన తరువాత ఎంత గొప్ప దర్శకుడైనా గతంలో ఫెయిల్ అయిన సెంటిమెంట్ త్రివిక్రమ్, గుణశేఖర్, సినిమాల విషయంలో నిజం అవడంతో ఈ సెంటిమెంట్ శ్రీను వైట్ల బ్రేక్ చేయగలుగుతాడా అనే ఆశక్తి అందరిలోనూ ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: