నటుడిగా, దర్శకుడిగా అటు కోలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న అర్జున్ తన స్వీయ దర్శకత్వంలో తానుహీరోగా తీస్తున్న 'జైహింద్‌ 2' సినిమా ప్రమోషన్ లో మీడియాతో మాట్లాడుతూ తనపై కుట్రపన్నే వారి గురించి తాను అస్సలు పట్టించుకోను అని అనడం కోలీవుడ్ మీడియాకు సంచలనంగా మారింది.  దీనితో అసలు అర్జున్ పై కుట్ర పన్నిందెవరు అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు రాయడం మొదలు పెట్టింది. అన్ని రంగాలు లాగే సినిమా పరిశ్రమలో కూడ మంచి చెడులుంటాయి అంటూ వాటిలో తాను మంచిని మాత్రమే తీసుకుంటాను కుట్రలు పట్టించుకోను అని అర్జున్ ఎవరిని దృష్టిలో పెట్టుకుని కామెంట్ చేసాడు అంటూ అనేక గాసిప్పులు కోలీవుడ్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  ఇరవై ఏళ్లక్రితం విడులైన 'జైహింద్‌' సినిమాకు సీక్వెల్ గా అర్జున్ తీస్తున్న 'జైహింద్‌ 2' లో నేటి విద్యారంగం ఎలా వ్యాపారంలా మారిపోయిందో చూపించే యదార్థ సంఘటనలతో అర్జున్ తన 'జైహింద్ 2 'ను మలుస్తున్న ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారో చూడాలి. అయితే మీడియాకు తన సినిమా గురించి ఇన్నివిషయాలు షేర్ చేసుకున్న అర్జున్ తన పై కుట్ర చేసింది ఎవరో చెప్పక పోవడం ట్విస్ట్.  

మరింత సమాచారం తెలుసుకోండి: