టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా సమంత డేట్స్ ఇస్తే చాలు అని ఇప్పటి వరకు ఆలోచించిన టాప్ హీరోల ఆలోచనలను మార్చడంలో ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ విజయం సాధించింది అనే వార్తలు వస్తున్నాయి. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ యిచ్చి కనీసం ఒక సంవత్సరం కూడ పూర్తి కాకుండానే ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలు చేరిపోవడం సంచలనంగా మారింది. గత నెలలో సమంత నటించిన రెండు భారీ సినిమాలు ఒకే నెలలో విడుదలై రికార్డును క్రియేట్ చేస్తే అదే పద్దతిని అనుసరిస్తూ రకుల్ నటించిన ‘లౌక్యం’, ‘కరెంట్ తీగ’ ఇంచుమించు రెండు వారాల గ్యాప్ తో విడుదలకాబోతూ ఉండటం టాలీవుడ్ కు సంచలనంగా మారింది. అంతేకాదు ఈ రెండు సినిమాల ఆడియో వేడుకలు నిన్న ఒకేసారి జరగడం బట్టి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కు కాబోయే టాప్ హీరోయిన్ అనే మాటలు వినిపిస్తున్నాయి. హాట్ గా నటిస్తూ ఎక్స్ పోజింగ్ చేసే విషయంలో సమంతకే సవాలు విసురుతున్న ఈ బ్యూటీని రవితేజ తాను నటిస్తున్న ‘కిక్ 2’ సీక్వెల్ కు ఎంపిక చేయడంతో నేటి టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ను రకుల్ ఖంగారు పెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: