చందమామ సినిమాలో నాగబాబు కూతురుగా నటించిన నాటి నుండి కాజల్ కు మెగా కుటుంబంతో అనుభందం పెరిగింది. నాగబాబు సలహాతోనే కాజల్ కు ‘మగధీర’ సినిమాలో ఛాన్స్ వచ్చింది అని చాలామంది అంటారు. ఆ తరువాత కాజల్ చరణ్ కు లక్కీ హీరోయిన్ గా మారడమే కాకుండా అల్లుఅర్జున్ తో కూడ నటించి మెగా కుటుంబంతో తన అనుబంధాన్ని సుస్థిరం చేసుకుంది.  చాలాకాలం తరువాత కాజల్ తిరిగి టాలీవుడ్ లో నటిస్తున్న సినిమా మెగా కుటుంబానికి సంబంధించింది కావడం యాదృచ్ఛికo అనుకోవాలి. ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ తనలోని ప్రతిభను చాటుకుంటున్న నిహారిక అదృష్టం కలిసి వస్తే మహిళా దర్శకురాలిగా మారాలని ప్రయత్నిస్తోంది అనే వార్తలు కూడ ఉన్నాయి. అయితే ఈ వార్తలను నిజం చేస్తూ కాజల్ నిహారికలు ఏమైనా తాము తీయబోయే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారా ? అని అనిపించేడట్లుగా ఎదో ఒక విషయం పై వీరిరువురు సుదీర్ఘంగా మాట్లాడుకుంటున్న సందర్భాన్ని నిన్న ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో వేడుకలో మీడియా కెమెరాలు తమ కెమెరాల ఫ్లాష్ తో క్లిక్ మనిపించాయి. ఆ మధ్య ఒక ఛానల్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ నిహారిక కాజల్ తరుచు తన తండ్రి నాగబాబును బయట కూడా నాన్నా అని పిలవడంతో ఒకప్పుడు తనకు కాజల్ పై కోపం వచ్చింది అని చెప్పింది. ఇప్పుడు ఆ కోపాన్ని మరిచిపోయి ఇలా సన్నిహితంగా మాట్లాడుకోవడం చూస్తుంటే రాజకీయాలలో సినిమాలలో ఎవరు శాశ్విత మిత్రులు శాశ్విత శత్రువులు ఉండరు అన్న విషయాన్ని నిహారిక మరోసారి రుజువు చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: