టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఓ స్టార్ హీరోకి ఉండే అభిమానం అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఒక్క సారి స్టార్ హీరో అభిమానుల్ని సంపాదించుకున్నాడంటే, వారి జీవితాంతం ఆ హీరోని, అభిమానులు ఆదరిస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ ఆగడు మూవీకి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. మహేష్ బాబు రేంజ్ ఏమిటన్నది తాజాగా మరోసారి వెల్లడైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ నటించిన 'ఆగడు' సినిమా ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుందనే విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ పంపిణీ చేస్తోంది. అయితే తాజాగా ఆగడు మూవీకి సంబంధించిన ఆన్ లైన్ బుకింగును సోమవారం ప్రారంభించగా, కొన్ని నిమిషాల్లోనే మొదటి 3 రోజులకి సంబంధించిన టికెట్స్ అన్నీ అమ్ముడైపోయాయట.అంతే కాకుండా ధియేటర్ల వద్ద ఇస్తున్న అడ్వాన్సు బుకింగ్ సైతం ఇప్పటికే క్లోజ్ అయింది. దీంతో తొలిరోజు షో కి సంబంధించిన టికెట్స్ అన్నీ సేల్ అయిపోయాయని సమాచారం. అయితే విజయావాడలో ఓ వీరాభిమాని ఆగడు మూవీకి సంబంధించిన టికెట్ ని 10,000 రూపాయలను పెట్టి మరీ కొనుకున్నాడు. అయితే తను ఆ టికెట్ ని తనకే దక్కాలనే ఉద్ధేశంతోనే ఆ విధంగా కొన్నానని చెబుతున్నారు. విజయవాడలో మొదటిషో కి సంబంధించిన కొన్ని టికెట్స్ ని అక్కడ వేలం నిర్వహిస్తే, వాటిలో తను ఆ టికెట్ ని సొంతం చేసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. దీంతో మహేష్ సినిమాకి వస్తున్న ఈ డిమాండు చూసి మార్కెట్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వస్తాయని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే బాక్సాపీస్ లెక్కలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: