రచయితగా ఫిల్మ్ కెరీర్ ని స్టార్డ్ చేసి, స్టార్ డైరెక్టర్ గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాపీస్ ని షేక్ చేసిన డైరెక్టర్ కొరటాల శివ. ఇదిలా ఉంటే కొరటాల శివ ఇప్పటి వరకూ డైరెక్టర్ గా ఒకే ఒక్క మూవీని చేశారు. తను చేసిన మిర్చి మూవీ బాక్సాపీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ గా నిలిచింది. అయితే మిర్చి మూవీ అంతా మాస్ సబ్జెట్ అయినప్పటికీ, హీరోని కొరటాల శివ చూపించిన క్లాస్ లుకింగ్ కి, టేకింగ్ మహేష్ బాబు ఫిదా అయిపోయాడంట. అందుకే కొరటాల శివ మిర్చి మూవీ తరువాత, మహేష్ బాబుకి కథ చెప్పి ప్రాజెక్ట్ ని ఓకె చేయించుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ, మహేష్ బాబు కి సంబంధించిన ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే తాజాగా 'పవర్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన పవర్ చూపిస్తున్న రవితేజ, దర్శకుల ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్టు క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఓపక్క మహేష్ బాబుతో సినిమాను అనౌన్స్ చేసిన శివ తాజాగా రవితేజతో కూడా చేయడానికి కథని సిద్ధం చేసుకుంటున్నాడు. దీనిని డీవీవీ దానయ్య తమ యూనివర్శల్ మీడియా బ్యానర్ పై నిర్మిస్తాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కి కొరటాల శివ తీసుకునే రెమ్యునరేషన్ ఓ రేంజ్ లో ఉందంటున్నారు. దాదాపు ఏడు కోట్ల రూపాయల వరకూ కొరటాల శివ, రవితేజా మూవీకి రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కేవలం అతి తక్కువ మూవీలకే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడంతో, కొరటాల శివ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: