టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాపీస్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోపాల గోపాల. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జంటగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఇప్పటికే వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సైతం ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత వెంకటేష్ మరో చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు దశరథ్ ఆమధ్య ప్రభాస్ తో 'మిస్టర్ పెర్ఫెక్ట్' వంటి బాక్సాపీస్ హిట్ తీశాడు. తర్వాత నాగార్జునతో 'గ్రీకువీరుడు' తీసాడు. అయితే గ్రీకువీరుడు మూవీ పలుకారణాలతో విడుదలకి ఆలస్యం కావడం, తరువాత అది బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడం జరిగింది. ఆ తరువాత దశరథ్ ఇప్పుడు మళ్లీ ఓ ఫ్యామిలీ స్టోరీ తయారుచేసుకున్నాడు. దీనికి ప్రముఖ నటుడు వెంకటేష్ ఓకే చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గోపాల గోపాల మూవీ షూటింగ్ అనంతరం, వెంకటేష్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మూవీ ఓపెనింగ్ ని పెట్టుకోవడం జరుగుతందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా చేసుందుకు శ్రుతిహాసన్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే శ్రుతిహాసన్ తో దశరధ్ టీం మాట్లాడినట్టు టాలీవుడ్ సమాచారం. దీనికి సంబంధించిన అఫిషియల్ స్టేట్ మెంట్ ని చిత్ర యూనిట్ త్వరలోనే ఇవ్వనుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: