నిన్న విడుదలైన మహేష్ ‘ఆగడు’ సినిమా ‘గబ్బర్ సింగ్-2’ సీక్వెల్ ను చూసినట్లుగా ఉంది అంటూ చాలామంది విమర్శకులు ఘాటైన కామెంట్లు చేసారు. ఈ కామెంట్లతో విసికేత్తి పోయిన మహేష్ అభిమానులు దసరాకు రాబోతున్న చరణ్ ‘గోవిడుడు అందరివాడేలే’ సినిమా పై దృష్టి పెట్టి వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు.  మహేష్ అబిమానులు లేవనెత్తుతున్న ప్రచారం ప్రకారం ‘ఆగడు’ పై ‘గబ్బర్ సింగ్’ ప్రభావం ఉంది అని అంగీకరిస్తే రాబోతున్న ‘గోవిందుడు అందరివాడేలే’ పై మహేష్ నటించిన ‘మురారి’ ప్రభావం ఖచ్చితంగా ఉంది అంటూ అప్పుడే ఒక విచిత్ర ప్రచారానికి తెర తీసారు.  దీనిని బట్టి టాక్ తో సంభందం లేకుండా ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ లా ఉన్నా మహేష్ అభిమానులు ‘ఆగడు’ సినిమాను ఎంజాయ్ చేస్తున్నట్లే రామ్ చరణ్ అభిమానులు కూడ గోవిందుడు సినిమాను ‘మురారి’ లా ఉన్నా ఎంజాయ్ చేస్తారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా నిన్న విడుదలైన ‘ఆగడు’ సినిమాను చూసిన రామ్ గోపాల్ వర్మ ‘ఆగడు’ సినిమా 75 కోట్ల సినిమా అయితే ‘మగధీర’ సినిమా 750 కోట్ల సినిమా అవుతుంది అని చెపుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు మహేష్ అభిమానులకు జీర్ణించుకోలేని విషయంగా మారింది అనే వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: