‘ఆగడు’ చిత్రానికి టాక్‌ ఏమంత ఆశాజనకంగా రాక పోయినా మొదటి రోజు ఆగడు కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తం గా అమెరికాలో నిర్వహించిన ప్రీమియర్ షో ల తో కలిపి మెదటి రోజు 15 కోట్లు వసూలు చేసింది అనే వార్తలు మహేష్ అభిమానులను ఆనందంలో ముంచెత్తి వేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఇదే ట్రెండ్ ను నిన్న కూడ ‘ఆగడు’ కొనసాగించి ఉంటే రికార్డులను క్రియేట్ చేసి ఉండేది అని విశ్లేషకులు అంటున్నారు.  కానీ అందుతున్న సమాచారం మేరకు నిన్న మన తెలుగు ఇరు రాష్ట్రాలలోను ఒక్క నైజాం ప్రాంతం మినహా కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో ‘ఆగడు’ వేడి తగ్గింది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ‘ఆగడు’ పై వచ్చిన డివైడ్ టాక్ తోడు కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా గుంటూరు ఉభయగోదావరి జిల్లాలలో కురుస్తున్న విపరీతమైన వానల ప్రభావం కూడ ‘ఆగడు’ కలెక్షన్స్ అనుకున్న విధంగా రాకపోవడానికి ఒక కారణం అని అంటున్నారు. అమెరికాలో మాత్రం ‘ఆగడు’ టాక్ తో సంబంధం లేకుండా రెండవరోజు కూడ ‘ఆగడు’ కలెక్షన్స్ దుమ్ము దులిపినా కోస్తా, రాయలసీమలలో ఈ సినిమా పై వచ్చిన బ్యాడ్ టాక్ రేపటి సోమవారం నుండి కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. ఇది ఇలా ఉండగా నందమూరి సింహం బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో ‘ఆగడు’ ను ప్రసాద్ ల్యాబ్ ధియేటర్లలో చూసి ఈ సినిమా నిర్మాతలను హీరో మహేష్ ను అభినందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. తనకు ‘లెజెండ్’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన ఈ సినిమా నిర్మాతలను ప్రోత్సహించడానికి బాలయ్య ప్రత్యేకంగా ‘ఆగడు’ ను చూడటమే కాకుండా అభినందిస్తూ మాట్లాడాడు అనే వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: