ఎన్టీఆర్ హీరోగా నటించిన 'రభస'తో ఆ సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్కు దిమ్మతిరిగిపోయింది. ఈ చిత్రం కారణంగా సురేష్ భారీ నష్టాన్ని చవిచూడవలసి వచ్చింది. బకాయిలు పెరిగిపోయాయి. తనయుడు శ్రీనివాస్ నటించిన 'అల్లుడు శ్రీను' విజయం సాధించినప్పటికీ అతను బయటపడలేకపోయారు. దాంతో తన కొడుకు శ్రీనివాస్ తదుపరి మూవీని నల్లమలుపు బుజ్జికి అప్పగించారు. అల్లు అర్జున్ హీరోగా తను నిర్మించిన 'రేసుగుర్రం' సినిమా హిట్తో బుజ్జి మంచి ఊపుమీద ఉన్నారు. బుజ్జి నిర్మించే ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన తమన్నా నటించే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే ఈ చిత్రంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించి, వెంటనే షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: